చీరాల గ్రామానికి చెందిన వల్లెపు పోలమ్మ అనే 35 సంవత్సరాల మహిళకు చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ లో ఆమెకు గర్భసంచి ఆపరేషన్ జరిగినది, ఆ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో హాస్పటల్ చుట్టూ రెండు సంవత్సరాల కాలం పాటు తిరిగిన ఉపయోగం లేకపోవడంతో మన సంస్థను ఆశ్రయించడం జరిగినది. హెచ్ఆర్సీ కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువచ్చి అన్ని పరీక్షలు చేయించడం జరిగినది, బాధితురాలు కి అండగా నిలబడి ఆమె చేత విజయవాడ గొల్లపూడి లోని Director of Public Health and Family Welfare Andhra Pradesh వారికి మరియు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని ఎథిక్స్ డిపార్ట్మెంట్ వారికి, హాస్పిటల్ యాజమాన్యం పై మరియు డాక్టర్ గారి పై విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయమని కోరుతూ మన HRCI తరుపున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారు సానుకూలంగా స్పందించి హాస్పిటల్ పై విచారణ జరిపి బాధ్యతరాలికి తగిన న్యాయం చేసి హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగినది.జాతీయ చైర్మన్ చెన్నిపాటి శ్రీకాంత్ గారు మాట్లాడుతూఎక్కడ అన్యాయం జరిగిన మా సంస్థ ముందుండి బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాము అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు, జాతీయ జనరల్ సెక్రెటరీ నందం నరసింహారావు, స్టేట్ ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కొండ జయలక్ష్మి గారు,స్టేట్ లీగల్ సెక్రెటరీ రాజ్యలక్ష్మి గారు, స్టేట్ మీడియా సెక్రెటరీ రమణ కుమార్ గారు, ఎన్టీఆర్ జిల్లా లీకర్ సెక్రెటరీ రవి గారు, కృష్ణాజిల్లా ప్రెసిడెంట్ రాము గారు, ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరావు గారు, ఎన్టీఆర్ జిల్లా వెల్ఫేర్ సెక్రెటరీ వెంకటరమణ గారుపాల్గొన్నారు.