హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, జాతీయ చైర్మన్, శ్రీ శ్రీకాంత్ చెన్నుపాటి గారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అను సంస్థను స్థాపించడం జరిగినది. మన సంస్థ ద్వారా సామాజిక సేవారంగంలో అత్యుత్తమ సహకారం అందిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేసినాము మన సంస్థ నుంచి సమాజానికి అందించిన సేవలను గుర్తించి మన చైర్మన్ శ్రీ శ్రీకాంత్ చెన్నుపాటి గారికి మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు 07-04-2023 వ తేదీన ఢిల్లీలో గౌరవ డాక్టరేట్ తో పురస్కరించడం జరిగినది. ఈ అవార్డును హెచ్ఆర్సీఐ సంస్థకి మరియు మన సంస్థలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యునికి అంకితం చేస్తున్నట్లు చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు తెలిపారు.