ఈ రోజు బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ పఠాన్ రంజిత్ బాషా గారిని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ గారిని కలిసి బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం లో ని నాయనపల్లి గ్రామంలో గల సర్వే నెంబర్ 148 లోని ప్రభుత్వ భూమి మరియు డ్రైన్ కాలువ కబ్జాకు గురి కావడం తో దాని పై సదరు వేటపాలెం MRO గారిని ఎన్ని సార్లు కలసి పిర్యాదు చేసినా ఆమె స్పందించకపోయెప్పటికి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేసి తగు చర్యలు తీసుకోమని వారిని కోరి మన HRCI సంస్థ తరుపున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగినది.వారు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తిని కాపాడుతాము అని చెప్పి సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మంచి పనులు చేస్తున్న హెచ్ ఆర్ సి ఐ సంస్థను అభినందించడం జరిగినది. కలెక్టర్ గారికి గౌరవపూర్వకంగా శాలువా కప్పి సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చె న్నుపాటి శ్రీకాంత్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు గారు, ఏపీ స్టేట్ లీగల్ సెక్రెటరీ పెండ్యం రాజ్యలక్ష్మి గారు, బాపట్ల జిల్లా మీడియా సెక్రెటరీ మల్లికార్జున రావు గారు పాల్గొన్నారు.