హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ డాక్టర్ శ్రీ శ్రీకాంత్ చెన్నుపాటి గారి ఆదేశాల మేరకు మన సంస్థకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు

ఈస్ట్ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో మిషన్ సరిగా పనిచేయట్లేదని చెప్పి ఇక్కడ టెస్ట్ చేయకుండా ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లుకు పంపిస్తున్నారు, వారు చిన్న మిషన్లో బాగా రబ్ చేసి, ఎక్కువ రబ్ అయిపోతుంది అని చెప్పి, తక్కువ రేటుకు అడిగి, కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ వారు ఇచ్చే ధర రైతులకు నచ్చకపోతే తిరిగి తీసుకెళ్ళి పొమ్మని ఉచిత సలహాలను ఇస్తున్నారు. తిరిగి తీసుకువెళ్తే అయ్యే ఖర్చులను భరించలేక, రైతులను ఏమీ చేయలేని స్థితిలోకి తీసుకెళ్లి, తక్కువ ధర కట్టి రైతుల వద్ద నుండే డబ్బులు తీసుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రం మరియు రైసు మిల్లు వారి వల్ల రైతులకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వారిని ఆశ్రయించడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా 22-05-2023 న ఉదయం 10 గంటలకు రాజమండ్రి( బొమ్మూరు) తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రైతులకు మద్దతుగా కలెక్టర్ గారిని కలవడం జరిగినది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి జిల్లా A.O గారిని పిలిపించి తగిన చర్య తీసుకోమని చెప్పియున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మీడియా సెక్రెటరీ గిరీష్ కుమార్ గారు, తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ భావన సత్యనారాయణ గారు పాల్గొన్నారు.