మానవ హక్కుల రక్షణ సామాజిక సేవే లక్ష్యంగా HRCI కృషి. తెలంగాణ హెచ్ ఆర్ సి ఐ నూతన కమిటీ ఎన్నిక. జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్,

మానవ హక్కుల రక్షణ సామాజిక సేవే లక్ష్యంగా (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) HRCI, పోరాడుతుందని జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాదులో తెలంగాణ శాఖ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు పాల్గొని మాట్లాడారు. నేరం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. సమస్య మీది సమాధానం మాది, సమాధానం మాదిగ ముందుండి పోరాడుతామన్నారు. చట్ట పరిధిలో హెచ్ఆర్సీఐ కొనసాగుతుందని, ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన కల్పించి చైతన్యపరిచి వారి హక్కుల పరిరక్షణకు పోరాడుతామన్నారు. సదస్సులు నిర్వహించి ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన కలిపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఆర్సిఐ మూడవ కన్నుగా నిలవాలని కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. న్యాయమైన పనికి సభ్యులు తలవంచకుండా ముందుకు సాగాలన్నారు, వృద్ధాశ్రమాలు ఏర్పాటుచేసి మానవసేవే మాధవ సేవగా కృషి చేయడానికి నిర్ణయించిందన్నారు, తెలంగాణ శాఖ కమిటీ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీఐ సౌత్ జోనల్ అధ్యక్షులు బెల్లం హరి ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు, ప్రధాన కార్యదర్శి పుల్లంరాజు ఉపాధ్యక్షులు శిరీష, రంగు శ్యాంసుందర్ రెడ్డి, పాల్గొన్నారు. (హెచ్ఆర్సీఐ తెలంగాణ కమిటీ ఎన్నిక) (తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా) మన శాఖ కమిటీ అధ్యక్షులుగా బేతి తిరుమలరావు, ప్రధాన కార్యదర్శిగా టీవీ పుల్లెం రాజు, తో 33 మందిని జాతీయ కమిటీ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ ప్రకటించారు. హెచ్ఆర్సీఐ తెలంగాణ తెలంగాణ శాఖ ( ఉపాధ్యక్షులుగా) రవీందర్ రెడ్డి , ఉపాధ్యక్షులు గోనెకొండ లింగయ్య, రాళ్ల బండి ప్రణయ్ రాజుగా, సంయుక్త కార్యదర్శిగా పోతురాజుల రమేష్, జీజుల శ్రీకాంత్, -(ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా) గంగిశెట్టి రాజా, కూరపాటి శ్రీనివాసరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కర్రీ తాతారావు, (మీడియా కార్యదర్శిగా) భాస్కరి రాజేశం,P. రమేష్ చంద్ర, సోమ పురుషోత్తం, గట్టు శ్రీనివాస, వెల్ఫేర్ కార్యదర్శులుగా రవీందర్ గౌడ్, చింత రవీందర్, గోలి మహేందర్, యాప తిరుమలేష్, లీగల్ కార్యదర్శులుగా తోఫీ అహ్మద్, ఎం అశోక్, వేల్పుల మురళీధర్ యాదవ్, ఎస్ రవీందర్ నాథ్, (కోఆర్డినేటర్గా) పోరండ్ల ప్రవీణ్ కుమార్, కొండు నరసింహారావు, (అధికార ప్రతినిధులుగా) అంజయ్య, వీ శ్రీనివాస్, కడె ఓం నమశివాయ, కన్వీనర్ బేతి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా పి శాంతన్ రాజు, ఆర్గనైజర్లుగా ఏ శ్రీనివాస్ రాజు, ఏ శ్రీనివాస్, బైరం మల్లేష్, కె అజయ్ చక్రవర్తి, రఘువీర్. ఎన్నికయ్యారు