స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ గారికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడలోని హెచ్ఆర్సీఐ ఆఫీసు నందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ గారికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది. జాతీయ ప్రధాన కార్యదర్శి నందo నరసింహారావు మాట్లాడుతూ దేశ పౌరులు అందరూ దేశభక్తిని కలిగి ఉండాలని, మానవ హక్కుల సంరక్షణకై మనHRCI సభ్యులు అందరం కలిసి పోరాడుదాం సమస్య మీది సమాధానం మాది అనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నూతనంగా జాయిన్ అయిన హెచ్ఆర్సీ కుటుంబ సభ్యులకు ఐడి కార్డ్స్ ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నందo నరసింహారావు, స్టేట్ ఉమెన్ బోర్డ్ ప్రెసిడెంట్ కొండ జయలక్ష్మి గారు, స్టేట్ లీగల్ సెక్రెటరీ పెండ్యం రాజ్యలక్ష్మి గారు, రాష్ట్ర వెల్ఫేర్ సెక్రెటరీలు ఊకోటి కిషోర్ బాబు గారు, ఎన్ గంగాధర్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ గారు, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ సెక్రెటరీ.అంగిరేకుల విజయ్ గారు, ఎన్టీఆర్ జిల్లా స్పోక్స్ పర్సన్ అంగిరేకుల సాయికిరణ్ గారు, ఎన్టీఆర్ జిల్లా వెల్ఫేర్ సెక్రెటరీ త్రినాథ్ వర్మ గారు పాల్గొన్నారు