హెచ్ ఆర్ సి ఐ ఆఫీస్ ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ పొల్లం రాజుగారు

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బేతి తిరుమలరావు గారి సూచన మేరకు, ఈరోజు ఖమ్మం జిల్లా హెచ్ ఆర్ సి ఐ ఆఫీస్ ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ పొల్లం రాజుగారు గారు ఆఫీస్ ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమo జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బేతి తిరుమల రావు గార్ల చేతుల మీదుగా ఆఫీసు ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ కులానికి మతానికి రాజకీయ పార్టీలకతీతంగా మన సంస్థ పనిచేస్తూ ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని ఆయన కోరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు మాట్లాడుతూ ఎక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుందో అక్కడ బాధితుల పక్షాన అండగా నిలబడి వారికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బేతు తిరుమల రావు గారు మాట్లాడుతూ మన సంస్థలో పని చేసే ప్రతి ఒక్కరు అవినీతికి తావులేకోకుండా పనిచేస్తూ ప్రశ్న మీది సమాధానం మాది అనే నినాదంతో ప్రతి సభ్యుడు ముందుకి వెళ్లాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ పుల్లం రాజు గారు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల వారికి అండగా నిలబడి మన సంస్థ నుంచి ప్రతి ఒక్కరు నిస్వార్ధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లీగల్ సెక్రెటరీ పెండ్యం రాజ్యలక్ష్మి గారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు చిర్రా రవి గారు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కత్తి రమేష్ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గంట ఉమాకాంత్ గారు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రీ తాతారావు గారు, స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ గణేషన్ గారు, స్టేట్ ఉమెన్ పోర్టు వైస్ ప్రెసిడెంట్ శిరీష గారు, భద్రాద్రి జిల్లా ఉమెన్ పోర్టు ప్రెసిడెంట్ ఉమా గారు, స్టేట్ వెల్ఫేర్ సెక్రెటరీ బలుసు రాము గారు మరియు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెహబూబాబాద్ జిల్లా సభ్యులు పాల్గొన్నారు.