మహిళల రక్షణ కల్పించే చట్టాల దిశగా ఆలోచన

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా స్థానిక 14 వ వార్డు పోతురాజు కాలనీలో తాత్కాలిక కార్యాలయంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు పల్నాటినాగరాజు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పలనాటి నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో గాని రాష్ట్రంలో గాని కొన్ని రాష్ట్రాలలో గాని మహిళల పట్ల రక్షణ లేకుండా పోయిందని ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో పలుచోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు అదేవిధంగా కొంతమంది నాయకులు కేంద్రంలో కూర్చొని భారత రాజ్యాంగంలోని కొన్ని రిజర్వేషన్ ఎలా తీసేయాలి కొన్ని చట్టాలను సవరణ చేయాలనే ఆలోచిస్తున్నారని అలా కాకుండా ప్రత్యేకమైన దృష్టి మహిళల రక్షణ కల్పించే చట్టాల దిశగా ఆలోచన చేసి మహిళల మానప్రాణాల మీద మహిళల ఆత్మగౌరవం మీద రక్షణ కల్పించే దిశగా దృష్టి పెట్టాలని ఇలా మహిళల మీద విరుచుకుపడుతున్న మృగాల మీద ఇండియన్ పీనల్ కోడ్ లోని కొన్ని సెక్షన్స్ ని కఠినం చేసి ఆ మూర్ఖులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు అలాగే మధ్యప్రదేశ్లో 8 ఏళ్ల బాలిక మీద జరిగిన సంఘటనని గురించి మరియు భీమవరంలో జరిగిన 14 మైనర్ బాలిక పైన జరిగిన హత్యాచారాన్ని తలుచుకొని ఆవేదన గురి అయ్యానని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల రాజేష్ మాట్లాడుతూ మన భారత దేశంలో రాష్ట్రంలో మహిళలకి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ఎవరైతే అమాయకమైన అమ్మాయిలు మీద విరుచుకుపడుతున్నారు అలాంటివారికి కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు వేసి అభాగ్యులైనటువంటి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యులు ఆరే మరీ దాసు, చార్రగడ్డ ప్రసాదు, ఎస్ డి సుభాని, బుజ్జి నాయక్ తదితరులు పాల్గొన్నారు.