జాతిపిత మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా విజయవాడలోని హెచ్ఆర్సీఏ ఆఫీస్

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా విజయవాడలోని హెచ్ఆర్సీఏ ఆఫీస్ నందు జాతీయ ప్రధాన కార్యదర్శి నందo నరసింహారావు మాట్లాడుతూ మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజునే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అని గాంధీ గారు సూచించారు, అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారికి శతకోటి నివాళులు అర్పిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి మాట్లాడుతూ జీవితాంతం అంకితభావంతో పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం సాధించిపెట్టిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెక్రెటరీ పెండ్యం రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మ గాంధీ జి ఆయన శాంతి ఐక్యత మరియు అహింసా విలువలు మన జాతికి మూలాధారం వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు, రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ కొండ జయలక్ష్మి గారు, రాష్ట్ర లీగల్ సెక్రెటరీ పెండ్యం రాజ్యలక్ష్మి గారు, ఎన్టీఆర్ జిల్లా మహిళ వైస్ ప్రెసిడెంట్ షేక్ అయేషా గారు పాల్గొన్నారు.