గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కలగానే మిగిలింది: జిల్లా అధ్యక్షులు పలనాటి నాగరాజు

నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు స్థానిక తెనాలి గాంధీచౌకిలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ గాంధీ గారు కలల కన్నా స్వరాజ్యం కలగానే మిగిలిందని మహిళలు అర్ధరాత్రి పూట నిర్భయంగా ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడే నిజమైన స్వరాజ్యం స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో మహిళల పట్ల అనేక రకమైన అత్యాచారాలు జరుగుతున్నాయని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు విద్యార్థులు యువకులు ఈ వైఖరిని ఖండించాలని సూచించారు. గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ సుభాని గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు ఎన్నో ఉద్యమాలు చేశారని వాటిలో నిరాకరణ సహాయోద్యమం క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా భారత దేశ స్వాతంత్రానికి పాటుపడ్డారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల రాజేష్ ఉపాధ్యక్షులు చాటగడ్డ ప్రసాదరావు అలాగే సాయి మరియు స్థానికులు పాల్గొన్నారు