హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా(HRCI) జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాలు మేరకు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బేతి తిరుమల రావు గారి సూచనల మేర భార్య భర్తల సమస్యను పరిష్కరించిన, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా(HRCI) 14:01:2024 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (ఇల్లందు) ఇల్లందు నివాసి అయిన భాను రేఖW/O సాయి ప్రసాద్, భర్త వేధింపులు భరించలేక హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా(HRCI) ను ఆశ్రయించిన బాధితురాలు, ఇరువురి పెద్ద మనుషులను పిలిపించి, బాధితురాలు ఏ విధమైన పరిష్కారం అయితే HRCI వారిని కోరినదో అదేవిధంగా భర్త సాయి ప్రసాద్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగినది. ఇకమీదట ఏ విధమైన తప్పులు చేయను అని, భార్యని మంచిగా చూసుకుంటానని తెలియజేయడం జరిగినది. ఎప్పుడు సమస్య వచ్చినా బాధితురాలి కి HRCI సంస్థ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ప్రజల సమస్యల పైన ఎల్లప్పుడూ స్వచ్ఛందంగా మా సంస్థ పని చేస్తుందని , తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రీ తాతారావు, తెలియజేశారు, ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ మెంబర్ కర్రీ అపర్ణ, భద్రాద్రి డిస్ట్రిక్ట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ మాచర్ల విజయకుమార్,భద్రాద్రి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ సెక్రెటరీ పులిమామిడి ఆంజనేయులు, భద్రాద్రి డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ బైపెల్లి సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.