మంగళవారం 03 మార్చి 2024 ఉదయతార మహిళలు స్వేచ్చగా రోడ్డుపైన తిరగ గలిగిన నాడు సంపూర్ణ స్వాతంత్య్రంవచ్చినట్టు : జాతీయ చైర్మన్, చెన్నుపాటి శ్రీకాంత్ వినో అంతర్జాతీయ మహిళదినోత్సవ కార్యక్రమానికి విచ్చేయుచును AN RIG SURCO 000 ఖమ్మం-ఉదయతార : సమాజంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని | హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం | తెలంగాణా రాష్ట్రం జిల్లా కేంద్రమైన ఖమ్మం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందుగా ఇక్కడ | నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని రాయడం గొప్పకాదు దాన్ని అమలు చేయడం గొప్పని అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. ఏ మహిళ అయిన స్వేచ్ఛగా రోడ్డు పైన తిరగ గలిగితే ఆ నాడే సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి మహిళను తల్లిగాను, అక్కగాను, చెల్లిగాను భావించాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు స్వప్న ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణా ఉప ముఖ్యమంత్రి భల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని నీ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు, సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ లింగాల శివ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు తరలి వచ్చారు.