ఘనంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం సతీమణి నందిని ఖమ్మం, మార్చి 4 (అమరావతి న్యూస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ స్వప్న ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి హాజరైనారు. డిప్యూటి సిఎం సతీమణి నందిని మాట్లాడు తూ జాతీయ చైర్మన్ శ్రీకాంత్ అధ్వర్యంలో జరుగుతున్న ఈ సంస్థ వల్ల మహిళలకు, ప్రజలకు మంచి జరుగుతుందని, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని పిలవ గానే వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సభ్యులను ఉంటున్నారని, ఈ విధంగా మానవ హక్కుల సంఘాలు ఉండటం గొప్పగా ఉందని హితవు పలికారు. జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్తో హక్కులపై జరుగుతున్న పోరాటం గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి అని చెప్పడం జరిగింది మా సహాయ సహకారాలు ఎల్లవేళలా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) కి ఉంటాయి అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహా రావు మరియు సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ లింగాల శివ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.