2/8 డబ్బు ముందు ఏది ఎక్కువ కాదు రక్త సంబంధాన్ని కాలితో తన్నుకున్న మహిళా మణీ పెద్దపల్లి ఉదయ నేటి కలియుగంలో డబ్బుకున్న ప్రాధాన్యత మరి దేనికీ లేదంటే | అతిశయోక్తి కాదేమో. రక్త సంబంధీకులను సైతం దూరం చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి ఉదంతం తెలంగాణా రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. బాధితుడు తన ఆవేదన అంతా మానవహక్కుల సంఘానికి వెళ్లబోసుకున్నాన్న దీన గాథ వివరాలు now ఈ విధంగా ఉన్నాయి. రాంగుండంలో నివసిస్తున్న పాత శ్రీనివాసరావు తండ్రి ముగ్గురు అన్నదమ్ములు. ఆఖరి తమ్ముడు వెంకయ్య కొడుకే పాత శ్రీనివాస్. పెద నాన్నకు పిల్లలు లేకపోవడం, రెండో పెద నాన్నకు ఐదుగురు కూతుళ్ళు. |శ్రీనివాస్ తన భార్య పిల్లలతో అక్కడ హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఊహించని సమయంలో దరిద్రం నెత్తి మీద కూర్చోవడంతో అతని, పెద్దమ్మ, పెద నాన్నలు ఇద్దరూ మాకు సంతానం లేని విషయం మీకు తెలుసు కదా మీరే మా పిల్లలుగా మేం భావిస్తాం మా ఇంటికి వచ్చి మాకు సేవ చేయండి. మా తదనంతరం మాకున్న ఆస్తి అంతా మీకే రాసిస్తాం అని పెద్దమ్మ, పెద నాన్నలు దిగులుతో బిక్క మొహం వేశారు. నీ కుటుంబానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పెద్దమ్మ, పెద నాన్నలు నమ్మ పలికారు. వారి దీనాతి దీన అభ్యర్థనకు ఐసులా కరిగిపోయిన శ్రీనివాస్ అయ్యోయ్యో మా పెద్దమ్మ, పెద నాన్నలు ఎంతో బాధపడుతున్నారు. మనం అత్యవరంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని శ్రీనివాస్ తన భార్యకు చెప్పి రామగుండానికి మకాం మార్చారు. శ్రీనివాస్ కుటుంబం వృద్దులతో ఉంటూ సేవలు చేస్తున్నారు. అయితే విధి వక్రించి శ్రీనివాస్ పెద నాన్న చనిపోయారు. పెద్దమ్మ లలిత తన ఇంటిని అమ్మేసింది. ఈ విషయాన్ని శ్రీనివాస్ తన పెద్దమ్మను అడిగితే కావాలంటే నీకు రెండు లక్షలు ఇస్తాను తీసుకో అని నోటి మాట అయితే చెప్పింది కానీ చిల్లీ గవ్వకూడా శ్రీనివాస్ కు ఇవ్వలేదు. పెద్దమ్మ లలిత తన అన్న పిల్లలకు ఆస్తి నీ కట్ట పెట్టే ప్రయత్నంలో వారి పేర్ల పై డబ్బును ఫిక్స్ డిపాజిట్ చేశారు. పెద్దమ్మ లలిత కులపెద్దలకు లేనిపోని మాటలు చెప్పి | శ్రీనివాస్ పై పలు కేసులు నమోదు చేయించారు. వంశ పారపర్యంగా వచ్చే ఆస్తి తనకే చెల్లుతుందని, తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాస్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్.ఆర్. సిఐ.) పెద్దపల్లి జిల్లాసంయుక్త కార్యదర్శి తకదీర్ కు శనివారం ఫిర్యాదు చేసితన ఆవేదనను వ్యక్తం చేశారు.