మానవ హక్కుల సంఘం నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన ఇద్దరు రాష్ట్ర సభ్యులను తొలగించిన జాతీయ కమిటీ అమరావతి-ఉదయతార : సమాజ శ్రేయస్సు కోసమే ఉద్భవించిన హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్.ఆర్.సి. ఐ) సంఘంలో అపశృతి ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణా రాష్ట్రం లో ఇద్దరు మానవ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులుగా చలామణి అవుతున్న కర్రి తాతారావు (తెలంగాణా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ), కర్రి అపర్ణ (రాష్ట్ర సభ్యురాలు) సంఘ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు, జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు ల సూచనలతో జాతీయ కమిటీ కర్రి. తాతారావు, అపర్ణల పై వేటు వేసింది. ఇక నుంచి సంఘానికి వారికి ఎలాంటి సంబంధం లేదని జాతీయ కమిటీ తెలిపింది. తమ సంస్థ పేరు చెప్పుకుని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే,తమకు సంఘానికి ఎలాంటి సంబంధం లేదని, సంఘం ఎలాంటి భాధ్యత వహించదని జాతీయ కమిటీ తెలిపింది. సంస్థ పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అలాంటి వారిపై హెచ్.ఆర్.సి. ఐ. చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆ కమిటీ తెలిపింది.