ఘనంగా బీసీ హక్కుల ఉద్యమ ప్రదాత పూలే జయంతి వేడుకలు -హెచ్రిసిఐ నాయకులు కుక్కల సత్యనారాయణ

- ఘనంగా బీసీ హక్కుల ఉద్యమ ప్రదాత పూలే జయంతి వేడుకలు -హెచ్రిసిఐ నాయకులు కుక్కల సత్యనారాయణ ర్ ఆఫ్ ఇంటి SUDISIONAL UPH ఓ..ఓ.. ఓ.ఎ.సి ఉద్యోగులచే మహాత్మా జ్యోతిరావు పూరే విగ్రహ నిర్మాణం విజయవాడ, ఏప్రిల్ 11 (అమరావతి న్యూస్) : బీసీ హక్కుల ఉ ద్యమ ప్రదాత, ఆధునిక భారత సామాజిక విప్లవోద్యమ పితామహులు రాష్ట్రపిత జోతిబా ఫూలే 196 వ జయంతి సందర్భంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఫూలే విగ్రహం కు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కృష్ణాజిల్లా అధ్యక్షులు కుక్కల వీర వెంకట సత్యనారాయణ పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుక్కల వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే ఏప్రిల్ 11, 1827న భారతదేశంలోని మహారాష్ట్రలో జన్మించారు. అన్నారు. అతను సామాజిక సంస్కర్త, ఆలోచనాపరుడు మరియు కార్యకర్త, కుల ఆధారిత వివక్షను నిర్మూలించడానికి మరియు విద్య మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు అని ఆయన సేవలు కొనియాడారు. 1848లో పూలే తన భార్య సావిత్రీబాయి ఫూలేతో కలిసి మహిళల విద్యపై విస్తృతంగా ఉన్న వ్యతిరేకతను ధిక్కరిస్తూ భారతదేశంలో మొదటి మహిళా మాత్రమే పాఠశాలను స్థాపించారు. పూలే లింగ మరియు కుల ఆధారిత సామాజిక అన్యాయాలను తొలగించడానికి అంకితమైన సత్యశోధక్ సమాజ్ను స్థాపించాడన్నారు. పూలే కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. అట్టడుగు వర్గాలు మరియు అట్టడుగు కులాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశాడు అన్నారు. జ్యోతీ రావ్ పూలేకి నివాళులర్పించిన వారిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యులు ఎం దేవకీ, కుంభా ఆది లక్ష్మి,పరసా సురేష్ తదితరులు ఉన్నారు.