హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు!!! పెందుర్తి ఏప్రిల్ 15 హర్షద్వని బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు హెచ్ ఆర్ సి ఐ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు విశాఖ పెందుర్తి ఎండిఓ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రెటరీ మాదేసు చారేంద్ర మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఎంత అవసరమని అన్నారు. ఆయన గొప్ప సంఘసంస్కర్తగా మరియు భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వెనుకబడిన వర్గానికి కాకుండా ప్రతి ఒక్క కుల మత జాతికి మేలు చేకూరేలా భారత రాజ్యాంగం రచించారని దేశానికి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని ఆయన తెలియజేశారు. భారత రాజ్యాంగ అనుసరించి మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన ఎడల హెచ్ ఆర్ సి ఐ తరఫున పోరాడి మానహ హక్కులని కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే హెచ్ ఆర్ సి ఐ విశాఖపట్నం ప్రెసిడెంట్ మహేష్ అగనంపూడి లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ స్పోక్స్ పర్సన్ చక్రపాణి రాష్ట్ర స్పోక్స్ పర్సన్ జయక్రిష్ణ మీడియా ఇంచార్జ్ రాజు, మురళి ఉమెన్ పోర్టు సభ్యురాలు సంతోషి రమణి పాల్గొన్నారు.