అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి విశాఖసిటీ, నిఘాటుడే: హెచ్ఐరిఐ జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నం పెందుర్తి జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఆనందదాయకంగా అందరి సభ్యుల మధ్యన జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరచనటు వంటి ముఖ్యమైన అంశాలను ప్రతి ఒక్కరు పాటించాలని రాజ్యాంగం మన భారతీయ పౌరులందరికీ సమాన హక్కులను రచించిందని అలాంటి హక్కులను ఎవరైనా ఉల్లంఘన కలిగిస్తే అలాంటివారికి హ్యూమన్ రైట్స్ గట్టి సమాధానం చెబుతుందని ఈ సందర్భంగా చారేంద్ర తెలియజేశారు. వీరితోపాటే మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ దళిత మైనారిటీ వర్గాల వారికి అంబేద్కర్ ఒక మహనీయుడని ఎన్నో ఏళ్ల కలని తన జీవిత కాలంలోనే దళితులకు తీర్చిదిద్దిన మహానీయుడు అంబేద్కర్ అని అలాంటి మహనీయుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తుంట జై కృష్ణ . మాదాసు చారేంద్ర . సెల్వాని ఉమెన్ పోర్ట్ చక్రవర్తి . . లీగల్ అడ్వైజర్ అప్పారావు. గొల్ల ఈశ్వరరావు.. మీడియా ఇంచార్జ్ రాజు ., చక్రపాణి, మురళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.