బడుగు బలహీనర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్: జాతీయ కార్యదర్శి, నందం నరసింహారావు

బడుగు బలహీనర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్: జాతీయ కార్యదర్శి, నందం నరసింహారావు " విజయవాడ-ఉదయతార : హెచ్ ఆర్ సి ఐ జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ సూచనలతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు తమ్మిన దుర్గారావు ఆధ్వర్యంలో విజయవాడలోని సింగ్ నగర్ లో ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ 133వ జయంతినీ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరచనటు వంటి ముఖ్యమైన అంశాలను ప్రతి ఒక్కరు పాటించాలని రాజ్యాంగం మన భారతీయ పౌరులందరికీ సమాన హక్కులను రచించిందని అలాంటి హక్కులను ఎవరైనా ఉల్లంఘిస్తే అలాంటివారికి హ్యూమన్ రైట్స్ గట్టి సమాధానం చెబుతుందని ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు తెలిపారు. అట్టడుగు అడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ అని అలాంటి మహనీయుని జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండ జయలక్ష్మి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పిస అరుణ్ కుమార్ కుట్టి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రెటరీ గూడేల రాజన్న ఎన్టీఆర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆయుష పాల్గొన్నారు.