ఉదయతార ఆదివారం 28 ఏప్రిల్ 2024

ఉదయతార ఆదివారం 28 ఏప్రిల్ 2024 రెండు హృదయాలను ఒకటి చేసిన మానవ హక్కుల సంఘం మచిలీపట్నం-ఉదయతార రెండు హృదయాలను ఒకటి చేసి జీవితాంతం | కలసి బతుకును కొనసాగించాలనుకున్న జంటను పెద్ద మనసుతో ఇరువర్గాల పెద్దలను ఒప్పించి ఒకటి చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్.ఆర్.సి. ఐ) అనే స్వచ్ఛంద సంస్థ. ఇద్దరి వ్యక్తులను పెళ్లి బంధంతో ఒకటి చేసిన ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా మండల కేంద్రమైన తోట్లవల్లూరు కు చెందిన ఆయేషా భర్త నుంచి విడిపోయి ఇద్దరి పిల్లలతో తల్లిదండ్రుల వద్ద జీవిస్తుంది. అదే జిల్లా మచిలీ పట్నం కు సమీపంలో ఉన్న పెడన గ్రామానికి చెందిన రఫీ కు | భార్యా మృతి చెందడంతో ఒంటరి వాడయ్యి అతని ఇద్దరి పిల్లలను పెంచి ఎలా పోషించాలా అని దిగులు పడుతున్న తరుణంలో అయేషాకు రఫీ తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. ఇరువర్గాలు పిల్ల భవిష్యత్తు కోసం ఇద్దరు కలసి జీవించాలనుకున్నారు. అయితే సినీ ఫక్కీలో ఆయేషా పెద్దలు పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా ఆమెను వేధించారు. ఇలా ఐతే తమ భవిష్యత్తు సాఫీగా సాగదని గ్రహించిన ఆయేషా స్థానిక మానవ హక్కుల సంఘం కృష్ణా శ్రీకాంత్ కె.వి.వి. నారాయణ గారు కృష్ణాజిల్లా | జిల్లా అధ్యక్షుడు కెవివి.సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కే. మౌలాలి ని ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరింది. దీనితో మానవహక్కుల సంఘం నాయకులు ఆయేషా | తల్లిదండ్రులు, పెద్దలను ఒప్పించి హెచ్.ఆర్.సి. ఐ. కార్యాలయంలోనే వివాహం జరిపించి నవ దంపతులిద్దరి నీ అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.