హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ హేమంత్ వాడరేవు గ్రామానికి చెందిన చేపల వ్యాపారం చేస్తే నిరుపేద సంతోష్ మూడు నెలల కుమార్తెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బ్లడ్ సెల్స్ తగ్గిపోవడంవంటి వ్యాధులతో బాధపడుతున్న ఆ పాప విషయం తెలుసుకుని ఆ పాప హాస్పటల్ చికిత్స నిమిత్తం 60 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆ పాప అమ్మమ్మ రమణమ్మకు ఇవ్వడం జరిగినది. అలాగే తోటపారి పాలెం గ్రామానికి చెందిన శీలం సాయి అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్న వారిని మానవత్వంతో స్పందించి ఆదుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ శివ నాగేశ్వరరావు HRCI కుటుంబ సభ్యులు వేణు, ఏసురాజు, మహేష్, సాయి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.